ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెయిలుపై విడుదలైన జనసేన నాయకులూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 23, 2022, 11:29 AM

విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి ఘటన విషయంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విశాఖ కేంద్ర కారాగారం నుంచి 9మంది జనసేన పార్టీ  నేతలు విడుదలయ్యారు.ఈ మేరకు కేంద్ర కారాగారం వద్ద సెక్షన్ 30ని పోలీసులు అమలు చేస్తున్నారు.దీంతో కార్యకర్తలు, అభిమానులు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కాగా తమకు బెయిల్ మంజూరు చేసిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి జనసేన నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు మద్దతు ఇచ్చి అహర్నిశలు సహకరించిన న్యాయవాదులకు, జనసేన లీగల్ సెల్ ప్రతినిధులకు జనసేన నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా తాము చట్టబద్ధంగానే పోరాటం కొనసాగిస్తామని PAC సభ్యుడు కోన తాతారావు స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ఎప్పటికీ నిలబడతామని, ఒత్తిళ్లకు, బెదిరింపులకు తలొగ్గేది లేదన్నారు.పోలీస్ వ్యవస్థను ఉపయోగించి తమపై అణచివేతకు పాల్పడ్డారన్నారు.న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa