ప్రజల సమస్యల పరిష్కారంపై సచివాలయ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె. రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 51 వ వార్డు పరిధి మాధవధార మాధవ స్వామి కళ్యాణ మండపం లో బుధవారం ఉదయం జీవీఎంసీ జోన్ -3 , 5 అధికారులతో కలిసి సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శితం రాజు సుధాకర్ , డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ జీవీఎంసీ జోన్ -3 , 5 కమిషనర్లు విజయలక్ష్మి, ఆర్. జి. వి కృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెకె. రాజు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే విధంగా ప్రజలకు నాణ్యమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ స్థాపించారని గుర్తు చేశారు. అదేవిధంగా అవినీతికి తావు లేకుండా ప్రజలకు రక్షణ సేవలు అందించేందుకు సచివాలయ వ్యవస్థ పని చేస్తుందని అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిరంతరం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్న మని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ ఆయా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ మెంబర్లు సారిపిల్లి గోవింద్, బర్కత్ అలి, కార్పొరేటర్లు కె. అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, ఆళ్ల లీలావతి రెయ్యి వెంకటరమణ, ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ గుజ్జు వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa