ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను బలమీనపర్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి...సీఎం జగన్ కు ఫిర్యాదు చేసిన మంత్రి రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 26, 2022, 08:40 PM

తనను నగరి నియోజకవర్గంలో బలమీనపర్చే కార్యక్రమాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి మంత్రి ఆర్.కె.రోజా ఫిర్యాదు చేశారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా బుధవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గం నగరిలో తనకు అసమ్మతి వర్గంగా తయారైన పార్టీ నేతలపై ఆమె జగన్ కు ఫిర్యాదు చేశారు. నియోకజవర్గంలో తనను బలహీనపరిచే దిశగా అసమ్మతి నేతలు కార్యక్రమాలు చేపడుతున్నారని, ఫలితంగా పార్టీ పరువు పోతోందని ఆమె జగన్ కు ఫిర్యాదు చేశారు. 


ఇటీవల పార్టీ కార్యకర్తలతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలాగైతే రాజకీయాలు చేయడం కష్టమేనంటూ రోజా చేసిన వ్యాఖ్యలు లీకైన సంగతి తెలిసిందే. ఈ నెల 16న రోజాకు సమాచారం ఇవ్వకుండానే నగరి పరిధిలో ఆర్బీకే, వెల్ నెస్ కేంద్రాలను అసమ్మతి నేతగా ఉన్న చక్రపాణి రెడ్డి వర్గం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న రోజా తన అనుచరులతో మట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపైనే ఆమె బుధవారం సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa