ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుప్పెడు బియ్యం నినాదంతో సేవ కార్యక్రమం..వీడియో పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 26, 2022, 08:41 PM

మానవసేవే మాదవ సేవా అన్నారు. పేదలను ఆదుకోవడానికి పెద్ద ఎత్తున్న ధన  ధర్మాలే  చేయాల్సిన అవసరంలేదు. గుప్పెడు బియ్యం దానం చేస్తే చాలు ఎంతో మందికి సహాయం చేయోచ్చు అన్న ఓ కాన్సెప్ట్ వీడియో ఇపుడు బాగా వైరల్ అవుతోంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బుధవారం సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు. కాకినాడ తీరాన్ని ఆనుకున్న ఉన్న పుదుచ్చేరికి చెందిన యానాంలో ఓ కళాశాలలో కొనసాగుతున్న దానం గురించి సాయిరెడ్డి తన పోస్టులో ప్రస్తావించారు.


యానాంలో ఏపీకి చెందిన పారిశ్రామికవేత్త రీజెన్సీ పేరిట సిరామిక్స్ కంపెనీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ ఏళ్ల క్రితమే మూతపడినా... యానాంలో ఆ కంపెనీ పేరిట ప్రారంభించిన సేవా కార్యక్రమాలు, విద్యాలయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలా యానాంలో ఏర్పాటైన రీజెన్సీ కళాశాలకు చెందిన అధ్యాపకుల ప్రేరణతో విద్యార్థులు ఐదేళ్ల క్రితం 'గుప్పెడు బియ్యం' పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం కళాశాలకు చెందిన 530 మంది విద్యార్థులు గుప్పెడు బియ్యం చొప్పున కళాశాలకు తీసుకొస్తున్నారు. ఈ బియ్యాన్ని కళాశాల అధ్యాపకులు అనాథలకు అందిస్తున్నారు. ఈ పథకాన్ని మెచ్చుకుంటూ విద్యార్థులు బియ్యాన్ని దానం చేస్తున్న ఫొటోను సాయిరెడ్డి తన పోస్టుకు జత చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa