వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు గత కొన్నిరోజులుగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుప్పం, మంగళగిరి, ఇచ్ఛాపురం, కర్నూలు తదితర నియోజకవర్గాలపై సమీక్ష చేపట్టిన చంద్రబాబు, నేడు మరో 6 నియోజకవర్గాల ఇన్చార్జిలను పిలిపించి వారితో సమీక్ష నిర్వహించారు. టెక్కలి, నర్సీపట్నం, పాతపట్నం, పొన్నూరు, పలమనేరు, తాడిపత్రి నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమీక్షించారు. చంద్రబాబుతో సమావేశమైన వారిలో అచ్చెన్నాయుడు (టెక్కలి), అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం), ధూళిపాళ్ల నరేంద్ర (పొన్నూరు) వంటి అగ్రనేతలు ఉన్నారు.
ఈ మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడిన చంద్రబాబు... అనేక అంశాలపై వారితో చర్చించారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఈ సమీక్ష జరిగినట్టు తెలుస్తోంది. ఆ మేరకు వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో కలమట వెంకటరమణ (పాతపట్నం), అమర్ నాథ్ రెడ్డి (పలమనేరు), అస్మిత్ రెడ్డి (తాడిపత్రి) కూడా పాల్గొన్నారు. తాజా సమీక్షతో కలిపి ఇప్పటిదాకా 117 నియోజకవర్గాల సమీక్ష పూర్తయింది. మిగిలిన నియోజకవర్గాల సమీక్షను త్వరలోనే చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa