వివిధ రంగాలలో జాతీయ..అంతర్జాతీయ అవార్డులను దక్కించుకొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు దక్కాయి. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఢిల్లీలో ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ఏపీలో 80 శాతం హెల్త్ కార్డులను డిజిటలైజేషన్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో కోట్లాది మంది ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఏపీలో మెడికల్ కళాశాలలను పెంచి వైద్య విద్యను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. 300కు పైగా ప్రొసీజర్లను చేర్చి ఆరోగ్యశ్రీ కింద బాధితులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి విడుదల రజిని వివరించారు.
తమ ప్రభుత్వం చేస్తున్న ఆరోగ్య సంస్కరణలకు గుర్తింపుగా గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు వచ్చాయని మంత్రి విడదల రజిని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఈ గ్లోబల్ అవార్డులనే నిదర్శనమన్నారు. కాగా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్ రెండు రోజుల పాటు నిర్వహించారు. ఐక్యరాజ్యసమితిలోని ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ ఈ కార్యక్రమానికి సహకారం అందించింది. భారత్లో ఇటీవలే ప్రారంభించిన 5జీ సేవలు దేశంలోని డిజిటల్ హెల్త్ కేర్ సిస్టమ్కు కొత్త విప్లవాన్ని తీసుకువస్తాయని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే భారత్ తనకు ఉన్న అనుకూల అంశాలను ఉపయోగించుకుని డిజిటల్ హెల్త్ లీడర్గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa