ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి పని చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 01:04 PM

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని... టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ పరిశీలకుడు పెచ్చెట్టి బాబు, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ చార్జి అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలంటే బూత్‌ కమిటీ కన్వీనర్ల పాత్ర ప్రధానమైనదని పేర్కొన్నారు. అమలాపురం అసెంబ్లీ నియోకవర్గ పార్టీ క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణను సత్యనారాయణ గార్డెన్స్‌లో బుధవారం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు అధ్యక్షతన నిర్వ హించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబు, పరిశీలకుడు బాబు ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. పార్టీకి విధేయతగా అందరూ కష్టించిన నాడే టీడీపీని అధికారంలోకి తీసుకురాగలమన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa