మనిషిలో అసుయా అన్నది ఎవరినైనా సరే రక్షేసుడిగా మార్చేస్తుంది. అదే తరహా అసుయతో ఓ మహిళ రాక్షేసురాలిగా మారింది. తనతో పాటే వ్యభిచారం చేస్తూ.. తనకన్నా అందంగా ఉండి, ఎక్కువ డబ్బు సంపాదిస్తుందనే అసూయతో తోటి మహిళను అతి దారుణంగా చంపేసింది ఓ వేశ్య. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కొందుర్గు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన మహిళ, ఫరూఖ్నగర్ మండలం కమ్మదనంలో నివాసం ఉంటున్న మరో మహిళ (40) ఇద్దరు వ్యభిచార వృత్తి రీత్యా మంచి స్నేహితులు. చాలా మంది పరిచయాలతో ఇద్దరూ.. వ్యభిచార వృత్తిని కొంత కాలంగా నడుపుతున్నారు. షాద్నగర్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో స్థానికంగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. అయితే తనతో పోలిస్తే.. తోటి మహిళ కొంచెం అందంగా ఉండటం.. విటులు ఎక్కువగా ఆమె దగ్గరికే వెళ్తుండటంతో.. నిందితురాలిలో మెల్లిగా అసూయ పెరిగింది. తన కన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తుందనే అక్కస్సుతో ద్వేషం పెంచుకుంది. ఎలాగైనా ఆమెను మట్టు పెట్టాలనుకుంది. అందుకోసం ఓ పథకాన్ని కూడా రచించింది నిందుతురాలు.
షాద్నగర్ బస్టాండ్లో స్వీపర్గా పనిచేస్తున్న లింగంతో కలిసి అక్టోబర్ 23న గంగన్నగూడెంలోని తన ఇంటికి మహిళను పిలుచుకుంది నిందితురాలు. లింగం, నిందుతురాలు ఇద్దరు కలిసి ఆమెకు మద్యం తాగించారు. ఆ తర్వాత కర్రతో ఆమె నెత్తిపై కొట్టారు. రక్తం మడుగులో ఉన్న మృతురాలి ముఖంపై నిందుతురాలు మెత్తతో అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసింది. దీంతో.. ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ఓ గోనెసంచిలో కట్టి.. తంగేళ్లపల్లి, చించోడు మధ్య ఉన్న వాగు పక్కన పడేశారు. స్థానికులు గమనించి వీఆర్ఏకు తెలపగా.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్టరీ కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఏసీపీ కుశాల్కర్ ఆదేశాలతో రూరల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో కొందుర్గు ఎస్సై కోన వెంకటేశ్వర్లు, కేశంపేట ఎస్సై ధనుంజయ రెండు బృందాలు దర్యాప్తు ప్రారంభించారు. వారికి మృతదేహం వద్ద ఉన్న బ్యాగులో రెండు బస్సు టికెట్లు లభించాయి. వాటిలో కమ్మదనం నుండి ఆమనగల్ వరకు ప్రయాణించింది ఒకటైతే.. షాద్ నగర్ నుండి కొందుర్గ్కు ప్రయాణించిన టికెట్ మరొకటి. ఈ టికెట్ల ఆధారంగా.. కమ్మదనం గ్రామంలో ఆరా తీయగా మృతురాలు గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నట్లు తెలిసింది. ఆమె ఉంటున్న ఇంట్లో దొరికిన ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమెకు గంగన్నగూడెంకు చెందిన నిందితురాలితో పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు.
ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు.. హత్య జరిగిన రోజు సీసీ ఫుటేజీ పరిశీలించారు. కాగా.. హత్య జరిగిన రోజు.. లింగంతో పాటు నిందితురాలు ఓ బైక్ మీద ఒక మూటను పెట్టుకొని వెళ్లినట్టు ఆధారాలు లభించాయి. 11 రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు.. గురువారం ఉదయం నిందితులను పోలీసులు పట్టుకుని విచారించగా అసలు విషయం బయటికి వచ్చింది. వారి నుండి రెండు తులాల బంగారు గొలుసు, చెవి పోగులు, కాళ్ల పట్టీలు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa