కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని నంద్యాల ఎంపీ పోచం బ్రహ్మానంద రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను మరియు చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa