ఇంటి యజమాని అప్రమత్తతో కుటుంబం ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకొంది. అప్పుడప్పుడే చీకటి పడుతోంది. ఇంట్లో లైట్లు ఆన్ చేశారు. ఇంటి యజమానికి ఎక్కడో తేడా కొట్టింది. గ్యాస్ వాసన వస్తోంది. వెంటనే కుటుంబసభ్యులందరినీ అప్రమత్తం చేశాడు. వాళ్లంతా మూకుమ్మడిగా ఆరుబయటికి పరుగు అందుకున్నారు. క్షణాల్లో పెద్ద పేలుడు. ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఇల్లు ధ్వంసమైంది. సామానంతా చెల్లాచెదురైంది. కుటుంబ పెద్ద అప్రమత్తతతో కుటుంబసభ్యులు మాత్రం తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం లింగాపురంలో శనివారం (నవంబర్ 5) సాయంత్ర ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజగోపాల్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది.
మంటలు విస్తరించకుండా స్థానికులు జాగ్రత్తపడ్డారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పొరుగు ఇళ్లకు వ్యాపించలేదు. గ్యాస్ పైప్ నుంచి గ్యాస్ లీకైందా? లేదా వెలిగించిన స్టవ్ ఆరిపోతే, ఇంట్లో వాళ్లు చూసుకోలేదా తెలియాల్సి ఉంది. గ్యాస్ లీకై ఇల్లంతా వ్యాపించింది. గ్యాస్ లీకవుతున్న విషయాన్ని గుర్తించి, రాజగోపాల్ తన కుటుంబ సభ్యులను తీసుకొని ఇంటి బయటకు వచ్చేశారు. కాసేపటికే పెద్ద శబ్దంతో సిలిండర్ పేలిపోయింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa