ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం చేతుల మీదుగా.. 'చిరస్మరణీయుడు' పుస్తకావిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 10:20 PM

ఏపీ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ జీవిత చరిత్ర పై రచించిన  'చిరస్మరణీయుడు' అన్న పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన జీవితంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, పాత్రికేయుడు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి 'చిరస్మరణీయుడు' పేరిట పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. పుస్తకావిష్కరణ సందర్భంగా, గౌతమ్ రెడ్డితో తన స్నేహానుబంధాన్ని సీఎం జగన్ గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి, సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa