మదర్సా అంటేనే ఎం బోదిస్తారు అంటే అందరూ ఇస్లాం మత విద్యా అని ఠక్కున చెబుతారు. కానీ ఓ మదర్సా ముస్లిం విద్యార్థులు భగవద్గీతను, శ్లోకాలు, మంత్రాలు పఠిస్తున్నారు. పైగా వాళ్లు సంస్కృతంలోనే మాట్లాడుకుంటున్నారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా..? అని ఆగ్రహించకండి. ఎందుకంటే ఇది ముమ్మాటికి నిజం. ఈ అద్భుతం కేరళలో జరుగుతుంది. త్రిస్సూర్ జిల్లాలో ఉన్న ఓ ఇస్లామిక్ విద్యా సంస్థ మత సామరస్యానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆ సంస్థలో ముస్లిం విద్యార్థులకు భగవద్గీతను, శ్లోకాలు, మంత్రాలను బోధిస్తారు. పొడవాటి తెల్లని దుస్తులు, తలకు కండువాలు ధరించిన హిందూ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు సంస్కృత శ్లోకాలు, మంత్రాలను పఠిస్తారు. క్లాస్ రూముల్లో గురువులు, శిష్యుల మధ్య సంభాషణ కూడా సంస్కృతంలో జరుగుతుంది.
అయితే విద్యార్థులకు ఇతర మతాల గురించి జ్ఞానం, అవగాహన కల్పించడం కోసమే ఉపనిషత్తులను పాఠ్యాంశాల్లో భాగం చేశామని అకాడమీ ఆఫ్ షరియా అండ్ అడ్వాన్స్డ్ స్టడీస్ (ASAS) ప్రిన్సిపాల్ ఒనంపిల్లి ముహమ్మద్ ఫైజీ చెప్పారు. "విద్యార్థులు ఇతర మతాలు, వారి ఆచారాల గురించి తెలుసుకోవాలని నేను భావించాను. కాబట్టి సంస్కృతం, వేదాలు, ఉపనిషత్తులు గురించి ప్రాథమిక జ్ఞానాన్ని అందించి ఇతర మతాల గురించి అవగాహన కల్పించాలనే ఆలోచన ఉంది." అని ఫైజీ చెప్పారు.
పదో తరగతి సాసైన విద్యార్థులకు ఎనిమిదేళ్ల పాటు సంస్కృతంలో భగవద్గీత, ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణంలోని కొన్ని భాగాలను బోధిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఫైజీ చెప్పారు. అయితే ఇలా అందరికి బోధించరు. వీటిని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఓ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అందులో తగిన అర్హత సాధించిన వారికి బోధిస్తారు. దీనికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కానీ, ఇతరుల నుంచి కానీ ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రిన్సిపాల్ ఫైజీ చెప్పారు. అయితే విద్యార్థులకు సంస్కృతం, భగవద్గీత, ఉపనిషత్తులు తదితరాలను సక్రమంగా బోధించేందుకు మంచి ఉపాధ్యాయుడిని వెతకడం పెద్ద సవాల్ అయిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa