చంద్రబాబును సంతోషపెట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీకెండ్ పర్యటనలు చేస్తున్నాడని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పేద ప్రజల సొంతింటి కల సహకారం అవుతుంటే.. అది చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓర్వలేకపోతున్నారన్నారు. రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు పర్యటనలు చేస్తూ.. ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి నిరూపిస్తామంటూ హడావుడి చేసిన పవన్ ఏం నిరూపించాడు.?.. వచ్చాడు, చూశాడు.. వెళ్లాడు..? అని ఎద్దేవా చేశారు. గుంకలంలోని జగనన్న కాలనీలో పర్యటన చేసిన పవన్.. ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపించగలడా..? అని పవన్కు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ విసిరారు. విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa