జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదివారం సాయంత్రం చీరాల నియోజకవర్గంలో పర్యటించారు. వేటపాలెం మండలంలోని కొనిజేటి చేనేతపురి గ్రామంలో చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి రాగానే చేనేతల సమస్యలను ప్రత్యేక కేటగిరీగా తీసుకొని ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమానికి ముందుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పందిళ్ళపల్లి బ్రహ్మంగారి మఠం నుండి బైక్ ర్యాలీ బయలుదేరి రామన్నపేట, వేటపాలెం మీదుగా చేనేతపురి గ్రామం చేరుకుంది. పవనన్న చేనేత బాట యువకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కమిటీ కార్యదర్శి వజీర్ భాషా , చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్ లతో పాటు చీరాల నియోజకవర్గ జనసైనికులు, చేనేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa