రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు టీడీపీ నేతలు సమాయాత్తమవుతున్నారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 45 రోజుల పాటు ‘ఇదేం ఖర్మ’ పేరిట వినూత్న కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా నేతలు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ‘బాదుడే బాదుడు’ పేరిట చేపడుతున్న కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇటువంటి తరుణంలో ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను మరింతగా ప్రజలకు తెలియజేసి, వారిని చైతన్యవంతం చేసేందుకు సంసిద్ధమవుతున్నారు. అదేవిధంగా పల్లె, పట్టణ ప్రాంతాల్లో సమస్యలను వెలుగులోకి తెచ్చి.. వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నారు. మొత్తంగా సర్కారు తీరును ఎండగట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa