నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం మంగళవారం ఉదయం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించి పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించడంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కాగా ఈ నెల 24న ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa