ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య అన్నారు. శనివారం ఉదయం గజపతినగరం మండలం పురిటిపెంట పంచాయతీ పరిధిలోగల మారుతి నగర్ కాలనీ, ఎస్సీ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అప్పలనరసయ్య రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వేమలి ముత్యాలనాయుడు, ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, ఎంపీడీవో కొవ్వాడ కిషోర్ కుమార్, తాసిల్దారు మరడాన అరుణకుమారి, గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ మండల సురేష్ వైసీపీ నాయకులు కరణం ఆదినారాయణ, పెదపెంకి ప్రసన్నకుమార్, రేఖ సురేష్, ఎంపీటీసీ రేగలత, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa