ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం నుంచి వస్తున్న వనరులు తప్పుదోవ పడుతున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 04:07 PM

రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు ఇచ్చే ఆదాయాన్ని గతంలో 32 శాతం ఇచ్చేవారని.. ప్రస్తుతం 42 శాతానికి కేంద్రం పెంచిందన్నారు. గతంలోనే ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి అప్పటి సీఎం అంగీకరించారని అన్నారు. ఏపీకి ప్రస్తుతం కేంద్రం నుంచి వస్తున్న వనరులు తప్పుదోవ పడుతున్నాయని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa