ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరిని కాపాడడానికి ఇదంతా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 04:17 PM

రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని, ఆ కేసు గురించి వదిలేయాలని, కేసును మూసేయాలని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ అభిషేక్‌ సింఘ్వీ సుప్రీంకోర్టులో చెప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వెల్లడించారు. ఎవరిని కాపాడడానికి ఇదంతా అని ప్రశ్నించారు. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి తెలిసే జరుగుతోందా? లేక నిర్ణయాలు ఎవరైనా తీసుకుంటున్నారా? అని నిలదీశారు. జగన్‌కు తెలియకుండా జరుగుతుందని తాను అనుకోవడంలేదన్నారు. తెలిసి జరిగితే మాత్రం జగన్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్నది మామూలు ద్రోహం కాదన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa