అయోధ్య సమీపంలోని లక్నో-ఫైజాబాద్ హైవే పక్కన, దన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం ప్రారంభం కానుంది. మసీదు నిర్మాణానికి ఎట్టకేలకు అయోధ్య డెవలపప్ మెంట్ అథారిటీ నుంచి అనుమతి వచ్చినట్లు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ ప్రకటించారు. తాము కేవలం మసీదు ఒక్కటే కాకుండా, 200 పడకల ఆస్పత్రి కూడా నిర్మిస్తామని తెలిపారు. మొదటి దశలో రూ.100 కోట్లు, రెండో దశలో రూ.100 కోట్లు వెచ్చిస్తామన్నారు. మసీదుకు సంబంధించి వెలుగులోకి వచ్చిన డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa