ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 08:21 PM

రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తాజాగా ఆ పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారిక లెక్కల ప్రకారం మూడేళ్లలో 1,673 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. రైతు స్వరాజ్య వేదిక సర్వే ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య 3 వేలకు పైగా ఉంది. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa