రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తాజాగా ఆ పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారిక లెక్కల ప్రకారం మూడేళ్లలో 1,673 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. రైతు స్వరాజ్య వేదిక సర్వే ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య 3 వేలకు పైగా ఉంది. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa