హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూలో 2014 నుంచి బీఎస్ఎఫ్ తరఫున భుంటార్ విమానాశ్రయంలో సేవలందించిన సామ్, మ్యాక్స్ అనే 2 శునకాల పదవీ విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. శునకాల కోసం రెడ్ కార్పెట్ పరిచి సందడి చేశారు జవాన్లు. వాహనంపై ఊరేగించిన సిబ్బంది అనంతరం కేకు కోసి పంచుకున్నారు. ఆ తర్వాత వాటి సేవలను గుర్తు చేస్తూ గ్రాండ్ సెల్యూట్ చేశారు. అనంతరం పూలమాలలతో సత్కరించిన విమానాశ్రయ సిబ్బంది వాటికి ఘనంగా వీడ్కోలు పలికారు.