ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాల ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలమంచిలి- గాజువాక ప్రధాన రహదారిలోని దేశపాత్రుని పాలెం బాలార్క్ హోటల్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిల ావున్నాయి. దేశపాత్రునిపాలేనికి చెందిన కె. మాధవరావు ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ర్గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. సరిగ్గా బాలార్క్ హోటల్కు సమీపానికి వచ్చే సరికి అదే రహదారిలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో మాధవరావుతో పాటు యువకులు మణికంఠ, భానులు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. చికిత్స నిమిత్తం యువకులను కేజీహెచ్కి తరలించారు. కాంట్రాక్ట్ర్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ఐ మల్లేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa