ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీచర్లు ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకోవాలని మంత్రి చెప్పడం పెత్తందారీ అహంకారం కాదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 24, 2022, 04:33 PM

సీఎం జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు  మండిపడ్డారు. ‘‘పెత్తందారీ పోకడలతో రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్‌రెడ్డి.. తన అవలక్షణాల్ని ఎదుటివారికి ఆపాదిస్తున్నారు. ఒకటే రాష్ట్రం... ఒకే కుటుంబం అని జగన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. హైదరాబాద్, తాడేపల్లి, బెంగుళూరు, చెన్నై రాజ భవనాల్లో ఏది జగన్ రెడ్డి ఇల్లు? రాష్ట్రంలో పాలెగాళ్ల పాలన తెచ్చిన జగన్ రెడ్డి కంటే పెద్ద పెత్తందారు ఎవరూ ఉండరు. టీచర్లు ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకోవాలని మంత్రి చెప్పడం పెత్తందారీ అహంకారం కాదా? వరుస సంఘటనలే ముఖ్యమంత్రి పెత్తందారీ పోకడలకు నిలువెత్తు నిదర్శనాలు. మాచర్ల మారణహోమం జగన్ సాగించాలనుకుంటున్న హత్యారాజకీయాలకు ఆరంభం. మాచర్లలో జరిగిన దహనాలు, లూఠీలు, దోపిడీలు ముఖ్యమంత్రికి, ఖాకీలకు కనిపించలేదా? పోలీసులు సీఎం పేషీ ఆదేశాలే అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వర్గమే పెత్తనం చేస్తోందని బొత్సలాంటి వాళ్లు కూడా అసంతృప్తితో ఉన్నారు. మంత్రులు నోరెత్తలేకనే ఉపాధ్యాయులు, ఉద్యోగులపై నెపం వేస్తూ మనసులోనిది వెళ్లగక్కుతున్నారు.’’ అని పుల్లారావు వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa