కొత్త ఏడాదికి అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా విమానయాన సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఎయిర్ లైన్స్ కంపెనీలు విమాన ప్రయాణికులకు చౌక ధరలకే టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. మార్కెట్ వాటా పరంగా మొదటి స్థానంలో ఉన్న ఇండిగో ఎయిర్ లైన్స్ దేశీ, విదేశీ విమాన సర్వీసుల టికెట్లపై ఆఫర్లను ప్రకటించింది. ఆఫర్లతో కూడిన డిస్కౌంట్ సేల్ 25వ తేదీ వరకే (ఆదివారం వరకే) అమల్లో ఉంటుంది.
2023 సంవత్సరం ఆగమనం సందర్భంగా రూ.2023కే ఒక్కో టికెట్ ను ఇండిగో అందిస్తోంది. దేశీ విమాన సర్వీసుల్లో టికెట్లను రూ.2023కు, విదేశీ సర్వీసుల్లో టికెట్లను రూ.4,999 నుంచి అందిస్తోంది. ఈ డిస్కౌంట్ సేల్ లో భాగంగా 2023 జనవరి 15 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య ప్రయాణాలపై ఆఫర్లను వినియోగించుకోవచ్చు.
ఎయిరేషియా ఇండియా సైతం న్యూ ఇయర్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. బెంగళూరు-కోచి తదితర మార్గాల్లో రూ.1,497కే టికెట్లను విక్రయిస్తోంది. డిసెంబర్ 25వ తేదీ వరకు చేసుకునే బుకింగ్ లపైనే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 2023 జనవరి 15 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య ప్రయాణ టికెట్లపై ఈ ఆఫర్లు పొందొచ్చు. ఎయిరేషియా పోర్టల్, మొబైల్ యాప్, ఇతర బుకింగ్ సైట్లలో బుకింగ్ లపై ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa