ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విరాళం ఇవ్వడంపై బీజేపీ ఆగ్రహంంద...అందుకే గాలి సొంత పార్టీ బాట

national |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 08:26 PM

బీజేపీ తీరుపై కలత చెందిన గాలి జనార్థన్ రెడ్డి సొంత పార్టీ ప్రారంభించినట్లు తెలుస్తోంది.  బళ్లారి ఐరన్ ఓర్ మైనింగ్ దిగ్గజం గాలి జనార్ధన్ రెడ్డి సొంత రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 'కల్యాణ రాజ్య ప్రగతి పక్ష' పేరుతో రాజకీయ పార్టీని ఆయన ప్రకటించారు. 2023 కర్ణాటక అసెంబ్లీలో గంగావతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. గంగావతిలో ఇప్పటికే ఆయన రాజకీయ కార్యాచరణను ప్రారంభించారు. తన భార్యతో కలిసి గంగావతి నియోజకర్గంలో పర్యటనలు చేస్తున్నారు. 


ఇటీవలే గంగావతిలోని ఓ అభివృద్ధి కార్యక్రమానికి రూ. 6 కోట్ల విరాళం ఇవ్వనున్నట్టు జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమయిందని తెలుస్తోంది. దీంతో ఆయన బీజేపీ నాయకత్వానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. మరోవైపు అక్రమ గనుల తవ్వకాల కుంభకోణంలో జనార్ధన్ రెడ్డి నాలుగేళ్లు జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు ఇచ్చిన కండిషనల్ బెయిల్ పై బయట ఉన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa