బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుండి ఆపన్న హస్తంతో ఆదుకున్న మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా అని బలిజ సంఘం నాయకులు డివి వెంకటసుబ్బయ్య, కొర్రపాటి సురేంద్ర, కొంకుల రమణ, గుర్రాల హరికృష్ణ, వెంకటసుబ్బయ్య, లధికం సురేష్, సుబ్బారావు తదితరులు పేర్కొన్నారు. రంగా 34 వ వర్ధంతి సందర్భంగా బద్వేలు పట్టణంలోని కేఆర్ బలిజ సంఘం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రంగా అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగవలసిన ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా ఉందని ప్రసంగించారు. కులమతాలకు అతీతంగా వంగవీటి మోహనరంగా చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa