ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అణగారిన వర్గాల కోసమే ఎం. ఎస్. పి ఆవిర్భావం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 06:38 PM

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కలలుగన్న సమ సమాజంతో పాటు దళిత రాజ్య స్థాపన కొరకు అణగారిన వర్గాలన్నీ మంద కృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన మహాజన సోషలిస్టు పార్టీ గొడుగు కిందకు రావలసిన తరుణం ఆసన్నమైందని ఆ పార్టీ ప్రకాశం జిల్లా సమన్వయకర్త ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు పేర్కొన్నారు. మహాజన సోషలిస్టు పార్టీ చీరాల, పరుచూరు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తల సమావేశం గురువారం చీరాల లో జరిగింది.


ఆరోగ్య శ్రీ పథకానికి రూపకల్పన, సామాజిక పింఛన్ల నగదు మొత్తం పెంపు తదితరాలన్నీ మందకృష్ణ మాదిగ సాగించిన పోరాటం ఫలితంగా అమల్లోకి వచ్చినవేనని వారు చెప్పారు. ఈ విషయాలన్నిటినీ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారు కోరారు. ఈ సమావేశం లోనే చీరాల, పర్చూరు నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తగా బుడంగుంట్ల లక్ష్మీ నరసయ్య మాదిగని నియమించారు. ఈకార్యక్రమంలో పల్లెపోగు నాని మాదిగ, మనోహర్ మాదిగ, ప్రసాద్ మాదిగ, తేళ్ల అవినాష్ మాదిగ, దుడ్డు రాంబాబు మాదిగ, సాయి, అప్పారావు లు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa