ఏపీ సీఎం జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. నర్సీపట్నం మండలం జోగునాథునిపాలెంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల కందుకూరులో చంద్రబాబు సభలో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. డ్రోన్ షాట్ ల కోసమే కందుకూరు సభ నిర్వహించి ఎనిమిది మందిని చంపేశారని విమర్శించారు. గతంలో గోదావరి పుష్కరాల్లోనూ ఇలాగే 29 మంది చనిపోవడానికి కారకులయ్యారని ఆరోపించారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఉందని, జనం రాకపోయినా జనం బాగా వచ్చారని చూపించేందుకు కందుకూరులోని ఇరుకు రోడ్డులో సభ ఏర్పాటు చేశారు. రాజకీయం అంటే డైలాగులు, కాల్పులు కాదని, రాజకీయం అంటే డ్రోన్ షాట్లు కాదని, రాజకీయం అంటే డ్రామాలు కాదని అన్నారు. పేదల జీవితాల్లో మంచి మార్పు తీసుకురావడమే రాజకీయమని సీఎం జగన్ తనదైన నిర్వచనం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa