ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్లపై సభలు ర్యాలీలు పెట్టి ఇప్పుడు వద్దంటారా.. జగన్ ప్రభుత్వం పై రఘురామ విమర్శ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 03, 2023, 08:58 PM

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్లపై ర్యాలీలు సభలు నిర్వహించిన వైఎస్ జగన్ కుటుంబం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అలా చేయకూడదని జీవో తేవడం ఎంతవరకు సబబు అని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల పాటు జగన్ కుటుంబమంతా రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లపై ర్యాలీలు వద్దంటారా? అని ప్రశ్నించారు. ర్యాలీలను రోడ్లపై కాకుండా గాల్లో చేస్తారా? అని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలకు బందోబస్తు ఇవ్వడం మీకు చేతకాదని అర్థం చేసుకోవాలా? అని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa