ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే లో పని చేస్తూ రైలు కిందే పడి మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 05:38 PM

ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఉద్యోగి దుర్మరణం పాలైన ఘటన ఎంటీఎంసీ పరిధిలోని సీతానగరం రైలు వంతెనల వద్ద గురువారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా కెనాల్‌ జంక్షన్‌లో కీమ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న గుండ్రాజు కొండమరాజు(49) సీతానగరం మధ్య రైలు వంతెన సమీపంలో పట్టాల మధ్య గ్రీజు పెడుతుండగా వెనకనుంచి వచ్చిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. తల ఛిద్రమై కొండమరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంతూరు తెనాలి కాగా, తాడేపల్లి కృష్ణా కెనాల్‌ రైల్వే జంక్షన్‌ క్వార్ట్‌ర్స్‌లో నివాసం ఉంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa