టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలంలోని గుండాలపాడు గ్రామానికి చెందిన వందమంది తెలుగు మహిళలు తమ గ్రామం నుంచి జొన్నలగడ్డలోని శ్రీ షిరిడీ సాయి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. గుండాలపాడులో తిరుపతమ్మ తల్లి ఆలయం నుంచి పాదయాత్రగా బయలుదేరిన మహిళలు పొనుగుపాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ రామాలయం, సాతులూరిలోని పేరంటాళ్ళమ్మ తల్లి ఆలయాల్లో పూజలు చేసి సాతులూరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాతులూరులో నాదెండ్ల మండల టీడీపీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ, సర్పంచ్ ముసుగు శోభారాణిలు పాదయాత్ర చేస్తున్న మహిళలకు స్వాగతం పలికారు. అలాగే పొనుగుపాడులో గ్రామ టీడీపీ అధ్యక్షులు రాఘవరావు, హరిబాబులు స్వాగతం పలికారు. అనంతరం జొన్నలగడ్డలోని శ్రీ షిరిడీ ఆలయంలో కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు. గ్రామానికి చెందిన నందిగం చంద్రశేఖర్, షేక్ బాజీ, జమ్ముల రవితేజ, సొంటినేని వెంకట బుల్లారావు తదితరులు మహిళల వెంట ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa