ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను నియంత్రించడంలో ముఖ్యమంత్రి జగన నియంత పాలన సాగిస్తున్నాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ పేర్కొన్నారు. పీలేరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.... మితిమీరిన అహంకారం, అధికారమదంతో జగన్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జగన వచ్చే ఎన్నికల్లో తప్పక పరాభవం పొందుతారన్నారు. జీవో నెం.1 ద్వారా సభలు, సమావేశాలపై ఆంక్షలు పెట్టాలని చూస్తున్న జగన ఒకసారి తన తండ్రి, తాను చేసిన పాదయాత్రలను గుర్తు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని, వారి అభిప్రా యాలను మార్చడం ఎవరి తరం కాదన్నారు. జగన సైకో పాలన పట్ల రాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఉన్నారని, చంద్రబాబు నాయుడ సుపరి పాలన గుర్తు చేసుకుని ఆయన సభలు, సమావేశాలకు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారన్నారు. తమ యువనాయకుడు లోకేశ ‘యువగళం’ పేరిట తలపెట్టిన పాదయాత్రను ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa