‘ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. జగన్ అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. అతనో ఫెయిల్డ్ సీఎం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కుప్పంలో రెండోరోజు పర్యటనలో భాగంగా ఆయన ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. మండలాల వారీగా పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అనంతరం పోలీసులు తన చైతన్య రథాన్ని తీసుకెళ్లినందుకు నిరసనగా పాదయాత్ర చేపట్టారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న ఎంఎం కల్యాణ మండపం వరకు ఆయన వెంట ముఖ్య నాయకులు, వేల మంది కార్యకర్తలు నడిచారు. ఎమర్జెన్సీ సమయంలోనే కాస్త బెటర్ అని.. ఇప్పుడు పోలీసులు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీలో ఉన్న విజ్ఞులు ఆలోచించుకుని, శాడిస్ట్ సైకోకు కాకుండా 5కోట్ల మంది ప్రజలకు సహకరించాలని కోరారు. ‘కుప్పంలో జరుగుతున్న అరాచకాలను బుధవారం నుంచి రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచంలోని తెలుగువారంతా చూస్తున్నారు. నేను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ పాదయాత్ర చేస్తే అడ్డుకోలేదు. షర్మిల పాదయాత్ర చేసినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వాలు సహకరించాయి. జగన్ తల్లి విజయలక్ష్మి ఎన్నోచోట్ల సభలు, రోడ్షోలు నిర్వహించారు. జగన్ పాదయాత్ర చేసినా సహకరించాను. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయలేదు. ఇప్పుడు నన్ను నా సొంత నియోజకవర్గంలో తిరగకుండా చేసేందుకు జగన్ జీవో తీసుకొచ్చాడు. జగన్ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి’ అని దుయ్యబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa