రాజకీయ దురుద్దేశంతో వైకాపా ప్రభుత్వం ర్యాలీలు, బహిరంగ సభల పై ఆంక్షలు పెడుతూ తెచ్చిన చీకటి జిఓ1 ని వెంటనే ఉపసంహరణ చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమో క్రసీ గుంతకల్లు డివిజన్ కార్యదర్శి బి. సురేష్ డిమాండ్ చేశారు. జిఓ1 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక పొట్టి శ్రీరాములు కూడలిలో సిపిఐ ఎంఎల్ న్యూడె మోక్రసీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపార్టీ డివిజన్ కార్యదర్శి బి. సురేష్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన బహిరంగ సభలో 8 మంది మరణిం చారని, గుంటూరు జిల్లాలో టిడిపి ఎన్నారైలు పంచుతున్న కానుకలలో ముగ్గురు మరణించినారని వీటిని సాగుగా తీసుకొని బహిరంగ ప్రదేశా లలో ర్యాలీలు, సభలు నిషేధిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జిఓ1 అప్రజాస్వామికం అన్నారు. ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే జగన్ రెడ్డి ప్రభుత్వం చీకటి జిఓ తెచ్చింద న్నారు. ఆ జీవోను వెంటనే ఉపసంహ రించుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసి డివిజన్ కమిటీ అధ్యక్షులు శ్రీరాములు, జిల్లా కమిటీ సభ్యులు సత్తార్, పిడిఎస్యు పట్టణ కార్యదర్శి తరుణ్, భీమా, ఐఎఫ్టియు కమిటీ సభ్యులు రఘునాథరెడ్డి, రామంజి, గోపి, కృష్ణ, జానయ్య, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa