ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కేసులు అక్రమమో, సక్రమమో తేల్చడానికి కోర్టులు ఉన్నాయి కదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 07, 2023, 08:15 PM

కేసులు అక్రమమో, సక్రమమో తేల్చడానికి కోర్టులు ఉన్నాయి కదా ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అన్నారు. ఆయన శనివారం నాడు గుంటూరు పోలీసు కార్యాలయంలో ఇన్విటేషన్ డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది. "సీఐడీ వ్యవస్థను వెలుగులోకి తెచ్చారు... ఏమనిపిస్తోంది సార్? గతంలో పోలీసులు అంటే తెలిసేది... ఇప్పుడు సీఐడీని కూడా పబ్లిక్ కి తెలిసేలా చేశారు" అంటూ సునీల్ కుమార్ ను ఓ రిపోర్టర్ అడిగారు. అందుకు సునీల్ కుమార్ నవ్వుతూ బదులిచ్చారు. తాను వచ్చాక సీఐడీ తెరపైకి రాలేదని, పరిస్థితుల వల్లే సీఐడీ వెలుగులోకి వచ్చిందని అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చాలు... సునీల్ కుమార్ అనే వ్యక్తి అక్రమ కేసులు బనాయిస్తున్నాడని టీడీపీ నేతలు అంటున్నారు... దీనిపై మీరేమంటారని ఆ మీడియా ప్రతినిధి అడగ్గా... "అందరూ ఏవేవో మాట్లాడుతుంటారు... ఆ కేసులు అక్రమమో, సక్రమమో తేల్చడానికి కోర్టులు ఉన్నాయి కదా" అని సునీల్ కుమార్ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa