ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంతవరకూ ఏ ప్రభుత్వం దళితులను ఈ తీరులో మోసం చేయలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 08, 2023, 01:59 PM

 ‘‘ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని హైకోర్టు సాక్షిగా రుజువైంది. ఏమిటీ ఘోరమని సాక్షాత్తు హైకోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి జగన్‌ తన తల ఎక్కడ పెట్టుకుంటారో చెప్పాలి’’ అని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు శనివారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పెట్టిన ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా దళితుల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేయలేదని బట్టబయలైందన్నారు. రాష్ట్రంలో ఇంతవరకూ ఏ ప్రభుత్వం దళితులను ఈ తీరులో మోసం చేయలేదని విమర్శించారు. ‘‘కోటిన్నర దళిత, గిరిజన కుటుంబాలను రోడ్డున పడవేసి నలుగురైదుగురికి మంత్రి పదవులు ఇస్తే సరిపోతుందా? మిగిలిన వారి కడుపు నిండిపోతుందా? పదవుల పిచ్చితో వైసీపీ ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధులు సిగ్గు లేకుండా సీఎం భజన చేస్తున్నారని మండిపడ్డారు. చట్ట ప్రకారం ఎస్సీ సబ్‌ ప్లాన్‌కు ఇవ్వాల్సిన నిధులను ఎగ్గొట్టడంతోపాటు కేంద్రం నుంచి వచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం వాటాను జమ చేయకపోవడంతో అవీ నిలిచిపోయాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, ట్రైకార్‌ సంస్థలు ఏమీ పని చేయనప్పుడు వాటిని నడపడం ఎందుకు... వాటిలో పనిచేసే ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వడం ఎందుకని ఆనందబాబు ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa