ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫాసిస్ట్ జీవోలపై సమిష్టి పోరాటం అత్యవసరం.. రఘురామకృష్ణంరాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 08, 2023, 10:27 PM

 'చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలుపడం శుభపరిణామం అని వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ఫాసిస్ట్ జీవోలపై సమిష్టి పోరాటం అత్యవసరం. రాబోయే విజయదశమిలోగా ప్రజలు సరైన తీర్పు ఇస్తారు. దుష్ట శిక్షణ తథ్యం. మంచి రోజులు వస్తున్నాయి' అని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు.


రఘురామ ట్వీట్‌లో ముందస్తు ఎన్నికల ప్రస్తావన లేదు. కానీ.. ఆ అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. విజయదశమి అక్టోబర్ నెలలో వస్తుంది. అయితే.. ఏపీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం.. 2024 మే నెలలో జరగాలి. కానీ.. రఘురామ విజయదశమిలోగా ప్రజలు సరైన తీర్పు ఇస్తారని ట్వీట్ చేశారు. అంటే.. 2023 అక్టోబర్ లోపే ఎన్నికలు జరుగుతాయని ఆయన పరోక్షంగా చెప్పారు. దీంతో ఏపీలో కొత్త చర్చ మొదలైంది. అలాగే.. ఆయన టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవచ్చు అనే యాంగిల్‌లో ట్వీట్ చేశారు. అటు చంద్రబాబు కూడా ఇదే అర్థం వచ్చేలా మాట్లాడారు. కానీ.. పవన్ మాత్రం పొత్తులపై ఎలాంటి కామెంట్ చేయలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa