ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కావాలిలో అరెస్టు చేసిన కార్యకర్తలందరిపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలి : నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 10, 2023, 08:20 PM

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ చలో కావాలి కార్యక్రమంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని తెలుగుదేశం నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీనిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులకు నిర‌స‌న‌గా తెలుగుదేశం ఎస్సీ సెల్ తలపెట్టిన 'ఛ‌లో కావ‌లి' కార్య‌క్ర‌మాన్ని అణచివేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజును అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో సమాచారం ఇవ్వడం లేదని విమర్శించారు. ఎం.ఎస్.రాజుపై, అరెస్టు చేసిన కార్యకర్తలందరిపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa