ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతరకు పటిష్ట బందోబస్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 02:21 PM

విజయనగరం జిల్లా పరిధిలోని శంబర పోలమాంబ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడు ఆదేశించారు. గురువారం శంబర పోలమాంబను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో పనులను పరిశీలించారు. జాతర ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు. చదురుగుడి వెనుక క్యూలైన్లు , బందోబస్తు నిర్వహించాల్సిన ప్రదేశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. జాతర బందోబస్తు వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. అనంతరం వనంగుడి పరిశరాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట ఏఎస్పీ దిలీప్‌కిరణ్‌, డీఎస్పీ ఎ.సుభాష్‌, సీఐ ధనుంజయరావు, స్పెషల్‌ బ్రాంచి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ జి.పైడిరాజు, ఆలయ ఈవో వి.రాధాకృష్ణ, ట్రస్టుబోర్డు చైర్మన్‌ పూడిదాలినాయుడు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa