ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలా ఏపీలో ఉద్యోగ సంఘాల నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తమపై సూర్యనారాయణ అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. గవర్నర్ ను కలిసి ఉద్యోగుల సమస్యలపై మాట్లాడకుండా, తమపై విమర్శలు చేయడమేంటని బండి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఇతర సంఘాలపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
ఒకవేళ మీ సంఘమే పెద్దది అనుకుంటే రేపట్నించే ఉద్యమం చేయండి అని సూర్యనారాయణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరొక్కరే చాంపియన్లు అయినట్టు, మేమేదో చవటలం అయినట్టు చిత్రీకరించడం మానుకోండి అని స్పష్టం చేశారు. 11 పీఆర్సీలు సాధించిన ఘనత తమ సొంతమని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సూర్యనారాయణ తన స్వార్థం కోసం ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa