ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్ యాత్రలో వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదు: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 08:01 PM

అసెంబ్లీ సంగతి పక్కనబెడితే, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్ అని రాప్తాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి  అన్నారు. అలాంటి లోకేష్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేసినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి ఉనికే లేదని ఆయన వ్యాఖ్యానించారు. 150 నియోజకవర్గాల్లో టీడీపీకి నాయకత్వమే లేదన్నారు. అయినా అధికారంలోకి వస్తే తాము ఏదో చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. వారిలా తాము కూడా అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని హెచ్చరించారు.


ఈ మేరకు అనంతపురంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ సంగతి పక్కనబెడితే, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు. అలాంటి లోకేష్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేసినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు.


తెలుగు దేశం పార్టీని 2019 ఎన్నికల్లో ప్రజలు 23 స్థానాలకే పరిమితం చేశారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. టీడీపీకి 420 వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారని, ఫేక్‌ సర్వేలతో కార్యకర్తలను మోసం చేస్తున్నారని విమర్శించారు. నాలుగు చానళ్లు, నలుగురిని కూటమిగా పెట్టుకుని ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమల్లో ఉన్నారని దుయ్యబట్టారు.


ప్రచార యావతో ప్రజలను చంపడమే మీ ధ్యేయమా అని టీడీపీ నేతలపై ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ఫైరయ్యారు. భూములు, స్థలాలను ఆక్రమించడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం టీడీపీ నేతలకు అలవాటని విరుచుకుపడ్డారు. ఇప్పుడేదో మంచివాళ్లయినట్లు మాయమాటలు చెప్తూ.. వైసీపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు మాట్లాడుతున్న భాషను చూసి రాష్ట్రంలోని మహిళలు చీదరించుకుంటున్నారని మండిపడ్డారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa