ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో షిరిడి సాయి మందిరంలో భక్తులు పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం నియోజకవర్గ పరిధిలో గల షిరిడి బాబా మందిరాల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. ఆమదాలవలస పట్టణంలోని పారిశ్రామిక వాడ, వెంగళరావు కాలనీ, పార్వతీశం పేట, వంశధార కార్యాలయ సముదాయంలో షిరిడి బాబా మందిరము అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉన్న బాబా మందిరం లోనూ, మోణింగివారివీధిలో ఉన్న లక్ష్మీ దేవి ఆలయం లో ఉన్న బాబా మందిరములోనూ, మెట్టక్కివలస బాబా మందిరం ఊసావానిపేట లో ఉన్న బాబా మందిరము లో అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితులు పూజలు జరిపారు. పూజలు సందర్భంగా మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ గోత్రనామాలతో పూజలు నిర్వహించి. తీర్థప్రసాదాలు స్వీకరించారు. పూజలను ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ , మురళి, సాయి, అమృతం పంతులు తదితరులు పూజలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa