ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిండన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక పై ఆగ్రహం వ్యక్తంచేసిన అదానీ గ్రూప్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 11:46 PM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హిండన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక పైనే ప్రధానంగా చర్చసాగుతోంది. ఇదిలావుంటే  అదానీ గ్రూప్ సంస్థల్లో భారీగా అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండన్‌బర్గ్ రీసెర్చ్ నివేదక ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం తెలిసింది. ఈ నివేదికతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అదానీ గ్రూప్ సంస్థలు భారీగా నష్టపోయాయి. అయితే, ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. భారత్ సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ 413 పేజీల స్పందన తేలియజేసింది. తాజాగా అదానీ గ్రూప్ స్పందనపై హిండెన్‌బర్గ్ సైతం బదులిచ్చింది. అదానీ గ్రూప్ ఇచ్చిన 413 పేజీల రిప్లైని తిప్పికొట్టింది. జాతీయ వాదం పేరుతో మోసాన్ని దాచిపెట్టలేరంటూ వ్యాఖ్యనించింది.


భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యమని, మంచి భవిష్యత్తుతో అగ్రరాజ్యంగా అవతరిస్తోందని హిండెన్‌బర్గ్ పేర్కొంది. అయితే అదానీ గ్రూప్‌తో దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని పేర్కొంది. ' కీలక విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోన్న అదానీ గ్రూపా..జాతీయ వాద అంశాన్ని తెరపైకి తేస్తోంది. భారతదేశంపై దాడి చేసేందుకే మా నివేదిక అన్నట్లు ప్రచారం చేస్తోంది. దీన్ని మేము అంగీకరించబోం. సంపన్నులైనా, అనామకులైనా మోసం ఎప్పటికీ మోసమే. జాతీయ వాదం పేరు చెప్పి లేదా అస్పష్టమైన స్పందనలతోనో మోసాన్ని దాచి ఉంచలేరు.' అని హిండెన్‌బర్గ్ తీవ్రంగా స్పందించింది. తమ రీసెర్ట్ రిపోర్ట్‌లో 88 ప్రశ్నలడిగితో అందులో 62 ప్రశ్నలకు అదానీ గ్రూప్ సమధానాలు చెప్పలేదని పేర్కొంది హిండెన్‌బర్గ్. వివిధ కేటగిరీలకు సంబంధించిన ప్రశ్నలకు సమధానం ఇవ్వకుండా జనరలైజ్డ్ ఆన్సర్ ఇచ్చారని పేర్కొంది.


మరోవైపు.. హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్ స్టాక్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు సోమవారం దాదాపు 10 శాతానికిపైగా నష్టపోయాయి. ఇదే సమయంలో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్స్ 6.3 శాతం లాభాల్లోకి వెళ్లడం గమనార్హం. ఇదిలా ఉంటే హిండెన్‌బర్గ్ నివేదికను తప్పుపట్టారు అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) జుగ్షింజర్ సింగ్. ఎలాంటి పరిశోధనలు లేకుండానే తమ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. అదానీ గ్రూప్ గతంలో ఇచ్చిన సమాచారాన్ని కాపీ చేసి ఆ నివేదిక రూపొందించారని, అదానీ గ్రూప్ ఎఫ్‌పీఓకు వెళ్లడానికి ముందు ఉద్దేశపూర్వకంగానే విడుదల చేశారని ఆయన అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa