ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంపిందాకా వదలం అంటున్న వైసీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 12:23 PM

పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం లో టీడీపీ నేత పై కాల్పులు కలకలం రేపుతున్నాయి. రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి పై వైసీపీ నేత పమ్మి వెంకటేశ్వరరెడ్డి కాల్పులు జరిపారు. ఇంట్లో నిద్రిస్తున్న బాల కోటి రెడ్డిని బయటకు పిలిచి పిస్టల్‎తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి..అనంతరం అక్కడిని నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో బాల కోటిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే దగ్గర్లో ఉన్న నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా కొద్ది నెలల క్రితమే కోటిరెడ్డిపై వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేయడంతో తృటిలో ప్రాణాపాయ స్థితి నుంచి బాల కోటిరెడ్డి బయటపడ్డాడు. ఇక తాజాగా స్వగ్రామం అలవాలలో కాల్పులతో హత్యాయత్నం మరోసారి కలకలం రేపుతోంది. సమాచారం తెలుసుకున్న టీడీపీ ఇన్ చార్జ్ చదలవాడ అరవింద్ బాబు కోటిరెడ్డిని పరామర్శించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa