ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 02:30 PM

భవన నిర్మాణ కార్మికులకు శాపంగా మారిన జీవో నెంబరు 17ను రద్దు చేయాలని ఏఐటీయూసీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.మునెప్ప డిమాండ్‌ చేశారు. శుక్రవారం భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షుడు ఆనంద్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మునెప్ప మాట్లా డుతూ భవన నిర్మాణ కార్మిక సం క్షేమ బోర్డు నుంచి వైసీపీ ప్రభుత్వం వాడుకున్న రూ.450 కోట్లను తక్షణమే జమ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 6 వేల భవన నిర్మాణ కార్మికులు క్లైయిమ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ఆనం ద్‌, కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డీసీ రహిమాన్‌, ఏఐటీయూసీ ఉప కార్యదర్శి రామాంజనేయులు, రేణుక, ఈర్నియా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa