ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎరువుల కొరతతో ఆ జిల్లాలో రైతుల ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 02:36 PM

ఏలూరు జిల్లాలో యూరియా, అమోనియాల కొరత రైతులను వేధిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నిల్వలు లేక రైతులు ప్రైవేట్‌ వ్యాపా రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు యూరియాను అధిక ధరలకు విక్రయించడం లేదా ఇతర ఉత్పత్తులను కొనాలని రైతులకు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న పంటలకు ప్రస్తుతం యూరియా, అమోనియాలు అందివ్వాలి. ఈ కొరత నేపథ్యంలో ప్రైవేట్‌ వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో రబీ సీజన్‌లో ఎక్కువగా మొక్కజొన్న, పొగాకు, వరి తదితర పంటలు సాగు చేస్తారు. ప్రస్తుతం ఆయా పంటలు నెల నుంచి నెలన్నర మధ్య కాలంలో ఉండటంతో పంట ఎదుగుదలకు యూరియా, అమోనియా అవసరం. ఆర్బీకేలలో యూరియా కొరత ఏర్పడింది. వాస్తవంగా యూరియా బస్తా ధర రూ.266.50. ప్రైవేట్‌ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బస్తా రూ.300 నుంచి రూ.330 వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలో మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 19 వేల హెక్టార్లు కాగా, ఈ ఏడాది 22 వేల హెక్టార్ల వరకు సాగవుతోంది. నూజివీడు డివిజన్‌లో ఆరు వేల హెక్టార్లలో పండిస్తున్నారు. వీటికే ఇప్పుడు కొరత ఏర్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa