ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ప్రాజెక్ట్‌ కోసం త్యాగాలు చేసిన వారికీ ఇప్పటికి జరగని న్యాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 02:34 PM

పోలవరం ప్రాజెక్ట్‌ కోసం త్యాగాలు చేసిన తమపై అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి నిర్మించిన కాలనీల్లో ఇళ్లు ఇచ్చేందుకు గందరగోళం నెలకొన డంతో శనివారం వారంతా నిరసన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రపురం మండలానికి చెందిన ములకలపల్లి గ్రామస్ధులకు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా పునరావాస కాలనీలను తాడువాయి వద్ద నిర్మించారు. వీరందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి పది నెలలు కావస్తోం ది. ఇంత వరకు ఎవరి ఇల్లు ఎక్కడ ఉందో తెలియని వారూ ఉన్నారు. ఇంటి పట్టాలలోవున్న నెంబర్ల ప్రకారం కాలనీకి వెళ్లి చూస్తే అక్కడ ఆ ఇంటికి వేరే నెంబర్లు వేసి ఉంటున్నాయని వాపోతున్నారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు 200 కిలోమీటర్లు దూరం నుంచి ఇల్లు చూడటానికి వస్తున్నా ఇక్కడ పట్టించు కోవడం లేదని, రెవెన్యూ అధికారులను అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. ఇక్కడకు వచ్చి వెళ్లేందుకు వెయ్యి రూపాయల ఖర్చు అవుతోందని మండి పడుతున్నారు. అధికారులు స్పందించి తమకు కేటాయిం చిన ఇళ్లను ప్రకటించి అప్పగించాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa