ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదాని గ్రూపు కంపెనీల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరు దురదుష్టకరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 02:33 PM

 అదాని గ్రూపుపై సమగ్ర దర్యాప్తు చేయాలని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు డిమాండ్‌ చేశారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో అదాని గ్రూపు కంపెనీల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్‌ సహా ప్రధాన విపక్షాలు తీవ్రస్థాయిలో దుయ్యబట్టాయన్నారు. దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఇక ఈనెల 6వ తేదీన కొంకాపల్లి ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల సుభాషిణి, మాచవరపు శ్రీమన్నారాయ ణ, సుగ్గు ప్రసాద్‌, వంటెద్దు బాబి, అయితాబత్తుల కుమార్‌సింగ్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa