ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2024లో టీడీపీ అధికారంలోకి వస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 02:32 PM

జగన్‌ పాలనలో ఎస్సీ,బీసీలకు పెద్దగా ఒరిగిందేమీలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం 47వ డివిజన్‌ ఇన్‌చార్జి బేసరి చిన్ని, కవులూరి వెంకట్రావుల ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమంలో ఎమ్మెల్యే భవాని, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌ పాల్గొన్నారు. స్ధానిక ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతుందని చెప్పారు. 47వ డివిజన్‌ శేషగిరి నగర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి ఆదిరెడ్డి కుటుంబం తమ భవాని చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, నల్లం శ్రీనుల పుట్టిన రోజును పురస్కరించుకుని వారితో ప్రారంభింపజేశారు. ఈ కార్యక్రమంలో వర్రే శ్రీనివాసరావు, తురకల నిర్మల, దాస్యం ప్రసాద్‌, కొయ్యల రమణ, అగురు ధనరాజ్‌, బంగారు నాగేశ్వరరావు, కడలి రామకృష్ణ, కోరుమిల్లి విజయశేఖర్‌, యిన్నమూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa